మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న భోజ్శాల–కమాల్ మౌలా నిర్మాణంపై సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదానికి కీలక మలుపు తిరిగింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ నిర్మాణం మసీదు కాదు, దేవీ సరస్వతికి అంకితమైన ఆలయమని తీర్పు ఇచ్చింది.
కోర్టు పరిశీలనలో ఈ స్థలం గతంలో సంస్కృత విద్యా కేంద్రంగా, సరస్వతి ఆలయంగా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) నివేదికలో కూడా ఆలయ నిర్మాణ భాగాలను ఉపయోగించి నిర్మాణం జరిగినట్లు సూచనలు ఉన్నాయని తెలిపింది.
ఈ తీర్పుతో అక్కడ నమాజ్కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయడంతో పాటు, ముస్లిం సమాజం కొత్తగా మసీదు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని కోర్టు సూచించింది.
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ భోజ్శాల వివాదంపై వచ్చిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.